Site icon vidhaatha

Gold Rates | షాక్ ఇచ్చిన పసిడి ధరలు.. చరిత్రలో తొలిసారిగా సరికొత్త గరిష్ఠాలకు..!

Gold

Gold Rates | ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన ధరలు కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చాయి. రెండు రోజుల పాటు స్వల్పంగా పతనమైన ధర.. బుధవారం బులియన్‌ మార్కెట్‌లో భారీగా పెరిగింది. దాంతో చరిత్రలో తొలిసారిగా పసిడి ధరలు కొత్త గరిష్ఠాలను తాకాయి. తొలిసారిగా తులం బంగారం ధర రూ.78వేల మార్క్‌ను దాటింది. మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.450 పెరిగి తులం రూ.71,400 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.490 పెరిగి.. తులం ధర రూ.77,890కి ఎగిసింది. ఇక దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.71,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,890కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.71,510 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.78,040 ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.74,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,890కి చేరింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.71,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,890 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. ఓ వైపు వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.100 పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97వేలకు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,03,000 పలుకుతున్నది. వాస్తవానికి బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ వస్తుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధరలో తేడాలుంటాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపై ధర ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం పడుతుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి. అలాగే, వివిధ దేశాల మధ్య జరిగే యుద్ధాలు సైతం ధరలపై ప్రభావం చూపుతుంది.

Exit mobile version