Gold Rates | పుత్తడి ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన ధరలు ఇటీవల తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు భారీగా పతనమైంది. 22 క్యారెట్ల పసిడిపై రూ.300 తగ్గి తులానికి రూ.53,650 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్లపై రూ.330 వరకు తగ్గి తులానికి రూ.58,530కి చేరింది. మరో వైపు వెండి ధర సైతం భారీగా తగ్గింది రూ.1200 వరకు తగ్గి.. కిలోకు రూ.73,500 పడిపోయింది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.రూ.53,500 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.58,350కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,200కి చేరింది.
చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.53,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,450కి పడిపోయింది. కేరళలో 22 క్యారెట్ల పసిడి రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,200కి తగ్గింది. బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల రూ.58,200కి పతనమైంది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.58,200 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి కిలోకు రూ.1200 వరకు దిగివచ్చి కిలోకు రూ.73,500 వద్ద కొనసాగుతుండగా.. హైదరాబాద్లో కిలో వెండి రూ.76వేలు పలుకుతున్నది.