Site icon vidhaatha

Gold Rate | పసిడి ప్రియులకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర..!

Gold

Gold Rate | పసిడి ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌. బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర శనివారం మళ్లీ పెరిగింది. మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరిగి తులానికి రూ.66,850కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.220 ఎగిసి తులానికి రూ.72,930కి చేరింది. అదే సమయంలో వెండి ధర తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,760కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,850 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,930కి ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,930కి చేరింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,930 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు ధర పతనమైంది. కిలోకు రూ.500 తగ్గడంతో ఢిల్లీలో రూ.84వేలకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.87,500 పలుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version