Site icon vidhaatha

Gold Rates | బంగారం కొనుగోలుదారులకు తీపికబురు.. మళ్లీ భారీగానే తగ్గిన ధర.. హైదరాబాద్‌లో నేటి ధర..

gold-rate

Gold Rates | మగువలకు ఇది నిజంగా గుడ్‌న్యూస్‌. పసిడి ధరలు వరుసగా భారీగా దిగిస్తున్నాయి. వరుసగా బులియన్‌ మార్కెట్‌లో మరోసారి భారీగా ధర పతనమైంది. బుధవారం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.400 తగ్గి తులానికి రూ.63,500కి దిగివచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.440 తగ్గి.. తులానికి రూ.69,270కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.63,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.69,060 పలుకుతున్నది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.63,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,420కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.63,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,270కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.63,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.69,270కి దిగివచ్చింది.

ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి సైతం భారీగా దిగివచ్చింది. రోజుకు కిలోకు రూ.400 వరకు పతనమైంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలోకు రూ.82వేలకు తగ్గింది. హైదరాబాద్‌లో కిలోకు రూ.87వేలకు చేరింది. ఇదిలా ఉండగా.. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version