Gold Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నాయి. మరోసారి బంగారం రూ.70వేల దాటడంతో కలవరానికి గురయ్యారు. ఈ క్రమంలో పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. మంగళవారం బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి కిలోకు రూ.3500 వరకు తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల పసిడి రూ.800 తగ్గి తులానికి రూ.63,900కి దిగివచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.870 తగ్గి.. తులానికి రూ.69,710కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.64వేలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.69,820 పలుకుతున్నది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.64,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,860కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.63,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,710కి చేరింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.63,900 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.69,710కి దిగివచచింది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి సైతం భారీగా దిగివచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒకే రోజుకు కిలోకు రూ.3500 వరకు పతనమైంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలోకు రూ.82,500కి తగ్గింది. హైదరాబాద్లో కిలోకు రూ.87,500కి చేరింది. దాదాపు రెండు మూడునెలల అనంతరం వెండి రూ.90వేల దిగువకు చేరింది.
ఈ ఏడాది మే మాసంలో వెండి రికార్డు స్థాయిలో పెరిగి రూ.90వేల ఎగువకు చేరింది. అప్పటి నుంచి వెండి ధర మళ్లీ రూ.90వేలకు దిగువకు దిగిరావడం విశేషం. ఇదిలా ఉండగా.. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.