Gold-Silver Rates | పసిడి కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. ఇటీవల పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఆదివారం బులియన్ మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.72,440 వద్ద స్థిరంగా ఉన్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,600 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,440 వద్ద స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.65,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,590 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,440 వద్ద ట్రేడవుతున్నాయి. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం నిలకడగానే ఉన్నది. ఢిల్లీలో కిలో రూ.91,500 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్లో హైదరాబాద్లో రూ.96వేల వద్ద స్థిరంగా ఉన్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.
Gold-Silver Rates | పసిడి కొనుగోలుదారులకు గుడ్న్యూస్.. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
