Site icon vidhaatha

Gold Rate | ఊరటనిచ్చిన పసిడి.. హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు ఇవే..!

goldrate

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఇటీవల గతంలో ఎన్నడూలేనివిధంగా పెరుగుతూ వస్తున్న ధరలు శనివారం బులియన్‌ మార్కెట్‌లో స్వల్ప ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.100 తగ్గి తులానికి రూ.68,050కి దిగివచ్చింది. 24 క్యారెట్ల పసిడి సైతం రూ.100 తగ్గి తులానికి రూ.74,2400 పతనమైంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.75,110కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.68,050 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.74,240 చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.68,210 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,390కి పతనమైంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.68,050 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.74,240 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.86,500 పలుకుతుండగా.. హైదరాబాద్‌లో రూ.90వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version