Bigg boss8| ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం అన్ని ప్రాంతీయ భాషలలో ఎంతగానో అలరిస్తుంది. తెలుగులో సక్సెస్ ఫుల్గా ఏడు సీజన్స్,ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో మరి కొద్ది రోజులలో ఎనిమిదో సీజన్ జరుపుకోబోతుంది. గత కొద్ది రోజులుగా ఈ సీజన్కి సంబంధించి నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 1 కుఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. సీజన్ 2 కు నాని హోస్ట్ చేశాడు . ఇక సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు అక్కినేనినాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండగా, సీజన్ 8కి మరో సెలబ్రిటీ హోస్ట్గా వ్యవహరిస్తాడని ప్రచారాలు జరుగుతుండగా, నాగార్జుననే హోస్ట్ అని అందరు అంటున్నారు.
ఇక సీజన్ 7కి మంచి రేటింగ్ రావడంతో సీజన్ 8 కోసం నాగార్జున భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ నడుస్తుండగా, యూట్యూబర్ ఆదిరెడ్డి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్.. సీజన్ 8 లో పాల్గొనే 18 మంది కంటెస్టెంట్స్ వీరే అని ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ సోనియా సింగ్, నటి హేమ, ఫార్మింగ్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీ, రీతూ చౌదరి, సురేఖావాణి లేదా ఆమె కూతురు సుప్రీత, కిరాక్ ఆర్పీ, కుమారి ఆంటీ, బర్రెలక్క, హీరోయిన్ కుషిత కల్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వచ్చే అవకాశం ఉందని, నీతోనే డాన్స్ 2.0 పాల్గొన్న ఒక జంట, లేదా జంటలో ఒకరు రావచ్చని చెప్పుకొచ్చాడు.
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హేమ, సోషల్ మీడియాలో సెన్సేషనల్ ఫోటో షూట్స్ చేస్తున్న నటి సురేఖావాణి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. హీరో రాజ్ తరుణ్ రావచ్చని, ఇక సురేఖావాణి రాని పక్షంలో ఆమె కూతురు సుప్రీత వచ్చే అవకాశం ఉందని అనేక ప్రచారాలు సాగుతున్నాయి. ఇక వాటితో పాటు జబర్దస్త్ మాజీ కమెడియన్ రీతూ చౌదరి ఎంపిక పూర్తి అయ్యిందనే వాదన తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ షో కోసం నిర్వాహకులు ఆమెని సంప్రదించగా, అందుకు రీతూ చౌదరి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తున్న నేపథ్యంలో ఈ భామని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవల దావత్ షోతో హోస్ట్ గా కూడా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. రీతూ వస్తే మైలేజ్ మరింత ఎక్కువ వస్తుందని భావించిన నిర్వాహకులు ఈ అమ్మడిని ఫైనల్ చేసినట్టు సమాచారం.