Nayanthara | నయనతారతో ఆ మూవీ చేయాల్సింది కాదు..! దర్శకుడు శేఖర్‌ కమ్ముల సంచలన వ్యాఖ్యలు..!

Nayanthara | టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా అంటేనే అభిమానులకు ఓ ఫీల్‌గుడ్‌ ఎమోషన్‌ కలుగుతుంది. ప్రశాంతంగా సాగడంతో పాటు ఆహ్లాదకరంగా, మనసును తాకుతుంటాయి. ఆనంద్‌, గోదావరి, హ్యాపీడేస్‌, లీడర్‌, ఫిదా తదితర చిత్రాలు ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి.

  • Publish Date - June 30, 2024 / 11:00 AM IST

Nayanthara | టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా అంటేనే అభిమానులకు ఓ ఫీల్‌గుడ్‌ ఎమోషన్‌ కలుగుతుంది. ప్రశాంతంగా సాగడంతో పాటు ఆహ్లాదకరంగా, మనసును తాకుతుంటాయి. ఆనంద్‌, గోదావరి, హ్యాపీడేస్‌, లీడర్‌, ఫిదా తదితర చిత్రాలు ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. కెరియర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా అన్ని చిత్రాలు అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. సాధారణంగా ఆయన కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటారు. ప్రేమకథా సినిమాలు తీసినా అందులో వైవిధంగా, సహజహసిద్ధంగా ఉంటాయి. అయితే, ఆయన కెరియర్‌లో కొన్ని ఫ్లాపులు తప్పలేదు. ఆయన జడ్జిమెంట్‌ పలుసార్లు బెడిసికొట్టాయని ఈ దర్శకుడు పేర్కొన్నాడు.

శేఖర్ కమ్ముల ప్రస్తుతం ‘కుబేర’ పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. గతంలో శేఖర్ కమ్ముల సౌత్‌ లేడి సూపర్‌స్టార్‌ నయనతార హీరోయిన్‌గా ‘అనామిక’ పేరుతో మూవీని తెరకెక్కించారు. ఇది రీమేక్‌ కాగా.. బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, తాను ఆ చిత్రం చేయడం తప్పేనని శేఖర్‌ కమ్ముల పేర్కొన్నారు. ఆ సమయంలో నిర్భయ సంఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించిందని.. అదే సమయంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని చేయాలనుకున్నానన్నారు. తనవద్ద కథ లేకపోవడంతో అనామిక మూవీని రీమేక్‌ చేసినట్లు చెప్పారు. నయనతార లాంటి స్టార్‌ హీరోయిన్‌ అయితే మూవీకి బాగుంటుందని తీసుకున్నామని.. అలాంటి స్టార్‌ హీరోయిన్‌తో మూవీని చేసి ఉండకూడదన్నారు. నిర్భయ ఘటనతో తొందరపడి నిర్ణయం తీసుకున్నానన్నారు. అయితే, లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ మూవీ సైతం వర్కవుట్‌ కాలేదని.. కొన్ని ప్రయోగాలు చేసి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. తను డబ్బుల కోసమే.. ఈఎంఐ చెల్లించేందుకో సినిమాలు చేయనని చెప్పారు.

ప్రయోగాలు చేసిన విఫలమైనా.. తాను లవ్‌ స్టోరీతో మూవీ చేస్తే తిరుగుండదన్నారు. అలాగని ప్రేమకథలే చేయనని.. తనకి అనిపించి ప్రేమకథ రాస్తే అద్భుతంగా వస్తుందన్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా ‘కుబేర’ మూవీని చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. ధనుష్, నాగ్ కాంబోలో వస్తున్న తొలిచిత్రం ఇదే. ఇక మూవీని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నది. జిమ్ సర్భ్‌తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Latest News