MSVPG Diwali Poster | ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ – చిరంజీవి కొత్త లుక్‌కి మెగా ఫ్యాన్స్‌ ఫిదా

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ చిత్రం నుంచి దీపావళి పోస్టర్‌ రిలీజ్‌. ఇద్దరు పిల్లలతో సైకిల్‌ తొక్కుతున్న చిరు లుక్‌ వైరల్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

Chiranjeevi’s Diwali Look From Mana Shankara Varaprasad Garu Trends

Chiranjeevi’s Diwali Look From Mana Shankara Varaprasad Garu Trends

(విధాత వినోదం డెస్క్​)

MSVPG Diwali Poster | మెగాస్టార్‌ చిరంజీవి – డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ అంటేనే టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. ఈ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’. చిరంజీవి నిజమైన పేరును టైటిల్‌గా పెట్టడం ఒక్కటే ఈ సినిమాపై అభిమానుల్లో ఎమోషనల్‌ కనెక్షన్‌ పెంచింది.

దీపావళి సందర్భంగా సినిమా యూనిట్‌ నుండి ఒక అద్భుతమైన పోస్టర్‌ విడుదల అయింది. అందులో చిరంజీవి గ్రీన్‌ హుడీ జాకెట్‌ వేసుకొని ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి సైకిల్‌ తొక్కుతూ కనిపించారు. చిరు ముఖంలో చిరునవ్వు, పిల్లల ఆనందం — మొత్తానికి ఆ ఫోటో ఒక్కటే ఫ్యామిలీ ఎమోషన్‌ను ప్రతిబింబిస్తోంది. మెగాస్టార్‌ కొత్త లుక్‌లో యంగ్‌ వైబ్రెన్స్‌, స్టైలిష్‌ టచ్‌ మెరుస్తున్నాయి.

అనిల్‌ రావిపూడి దీపావళి శుభాకాంక్షలు

సోషల్‌ మీడియాలో అనిల్‌ రావిపూడి అభిమానులకు “మన శంకర వరప్రసాద్‌ గారు టీమ్‌ తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నవ్వుల టపాసులు సంక్రాంతికే పేలుద్దాం!” అంటూ ట్వీట్‌ చేశారు. ఆ మాట ఒక్కటే సినిమా టోన్‌ క్లియర్‌ చేసింది – ఇది ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవబోతోంది. చిరంజీవి కూడా తన అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్‌) హ్యాండిల్‌ ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, “దీపావళి వెలుగులు మీ జీవితాల్లో ఆనందం, విజయాలు, సంతోషం తీసుకురావాలని కోరుకుంటున్నాను,” అని రాశారు.

వింటేజ్‌ చిరు ఈజ్‌ బ్యాక్‌!

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, సాంగ్స్‌ ద్వారా ఒక విషయమైతే స్పష్టమైంది — వింటేజ్‌ చిరు స్టైల్‌, కామెడీ, ఎమోషన్‌ మళ్లీ రానుంది. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, “ఈ సినిమాలో చిరంజీవిని మనం ఇంతవరకు చూడని ఫ్యామిలీ అవతారంలో చూస్తాం. 95 శాతం సీన్లు రియలిస్టిక్‌గా తీస్తున్నాం. వీఎఫ్ఎక్స్‌ దాదాపుగా మినిమమ్‌,” అని చెప్పారు.

చిరంజీవి – నయనతార జంట మళ్లీ కలిసింది

‘సైరా’ తర్వాత చిరంజీవి – నయనతార జంట మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈసారి వారు భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు. కథ ప్రకారం, వీరిద్దరి మధ్య వచ్చే విభేదాలు, కుటుంబ అనుబంధాలు, పిల్లలతో ఉన్న బంధం నేపథ్యంలో సినిమా సాగేలా ఉంటుంది. టాలీవుడ్‌లో లీకైన కథ ప్రకారం — చిరంజీవి ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మిషన్‌లో నయనతారను మళ్లీ కలుసుకోవడం కథలో ముఖ్య మలుపుగా ఉంటుంది. ‘డాడీ’ తర్వాత చిరంజీవి మళ్లీ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఆయన పాత్రలో కుటుంబ ప్రేమ, త్యాగం, ఎమోషన్‌ పుష్కలంగా ఉండబోతోందని తెలిసింది. అభిమానులు చెబుతున్నారు — “ఇదే ఆ చిరు మిస్‌ చేసిన సెంటిమెంట్‌ టచ్‌” అని.

ఈ సినిమాలో నయనతారతో పాటు కేథరిన్‌ ట్రెసా, విక్టరీ వెంకటేష్‌, హర్షవర్ధన్‌, రేవంత్‌ భీమల, బుల్లిరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం భీమ్స్‌ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ సమీర్‌ రెడ్డి, ఎడిటింగ్‌ తమ్మిరాజు.
ఈ సినిమాను షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతలుగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల – చిరంజీవి కుమార్తె – వ్యవహరిస్తున్నారు.

అనిల్‌ రావిపూడి సినిమాలకు సంక్రాంతి సీజన్‌ అదృష్టకరమని ఫ్యాన్స్‌ నమ్మకం. అందుకే ఈసారి కూడా ఈ సినిమాను 2026 జనవరి 12న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారు. పోస్టర్‌లో ఉన్న చిరు ఫ్యామిలీ లుక్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండగా, “మన శంకర వరప్రసాద్‌ గారు” హ్యాష్‌ట్యాగ్‌ టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచింది.

Megastar Chiranjeevi’s upcoming film “Mana Shankara Varaprasad Garu” directed by Anil Ravipudi released a Diwali poster showing Chiru cycling with two kids, charming fans with his youthful look. The makers confirmed a Sankranthi 2026 release. Starring Nayanthara and Catherine Tresa, the film promises family emotions, comedy, and vintage Chiru energy.