Pavithra Gowda | పోలీస్‌ కస్టడీలో మేకప్‌ వేసుకున్న పవిత్రా గౌడ..! మహిళా ఎస్‌ఐకి ఉన్నతాధికారుల నోటీసులు..!

Pavithra Gowda | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకకు చెందిన రేణుక స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌తో పాటు సినీనటి పవిత్ర గౌడ్‌ అరెస్ట్‌ అయ్యారు. ఇద్దరు ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీపై పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, పోలీసు కస్టడీలో ఉన్న ఆమె మేకప్‌ వేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

  • Publish Date - June 27, 2024 / 11:04 AM IST

Pavithra Gowda | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకకు చెందిన రేణుక స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌తో పాటు సినీనటి పవిత్ర గౌడ్‌ అరెస్ట్‌ అయ్యారు. ఇద్దరు ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీపై పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, పోలీసు కస్టడీలో ఉన్న ఆమె మేకప్‌ వేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది. రేణుకస్వామిని అత్యంత కిరాతకంగా హత్య చేసినా ఆ విషయంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా పవిత్ర వ్యహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రేణుకస్వామి హత్య తీరుతెన్నులను తెలుసుకునేందుకు పవిత్ర గౌడను బెంగళూరులోని ఆమె నివాసానికి పోలీసులు తరలించారు.

అయితే, ఈ క్రమంలో ఆమె మేకప్‌ వేసుకుంటూ తన నివాసం నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. పోలీసుల వెంట ఉన్నప్పుడే ఆమె మేకప్‌ వేసుకుంటున్నట్లు తేలింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. పవిత్ర వెంట ఉన్న మహిళా ఎస్‌ఐకి నోటీసులు జారీ చేశారు. సినీ నటిని అడ్డుకోవడంలో ఎస్‌ఐ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారని.. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని ఎస్‌ఐని ఆదేశించారు. పవిత్ర తాను ఉండే ఇంట్లో మేకప్‌ బ్యాగ్‌ పెట్టుకొని ఉండాలని.. లేడీ ఎస్‌ఐ ప్రతిరోజూ పవిత్రను ఆమె ఇంటి నుంచి ఏపీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లేవారని.. పవిత్రను కనిపెట్టి ఇలాంటి పనులు చేయకుండా అడ్డుకుని ఉండాల్సిందన్నారు. నిర్లక్ష్యంపై వివరణ కోరుతూ ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు డీసీపీ (వెస్ట్‌) గిరీష్‌ తెలిపారు. దర్శన్‌ను రెచ్చగొట్టి పవిత్ర రేణుకస్వామిని హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

హత్య కేసులో దర్శన్‌ ఏ-2గా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుకస్వామి పవిత్రకు అభ్యకర సందేశాలు పంపినట్లు తెలుసుకున్న దర్శన్‌ ఆగ్రహానికి గురై హత్య చేసినట్లు తేలింది. జూన్‌ 9న రేణుకస్వామి మృతదేహం ఓ నాలావద్ద లభ్యమైంది. అతన్ని దారుణంగా హింసించి హతమార్చినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హత్య కేసులో జైలులో ఉన్న పవిత్ర ఇటీవల జైలులో సిబ్బందితో గొడవ పడినట్లుగా సమాచారం. తనకు ఇంటి వద్ద నుంచి దుప్పటిని తీసుకువచ్చి ఇవ్వాలని.. జైలులో తనకు అది కావాలి.. ఇది కావాలంటూ మహిళా సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. అలాగే, జైలు భోజనం చేసేందుకు సైతం నిరాకరించిందని టాక్‌. అయితే, పోలీసులు ఇదేం ఇల్లు కాదని.. ఇంటి వాతావరణానికి అలవాటు పడాలని.. మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలని కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

Latest News