Ram Charan| బాల‌య్య కూతురితో మెగాస్టార్ త‌న‌యుడు.. ఫ్రేమ్ అదిరిపోలా..!

Ram Charan| ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రిత్వ శాఖల మంత్రులుగా గెలుపు గుర్రాలు ప్రమాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాణ స్వీకారోత్సవ కార్య‌క్ర‌మంలో ఆస‌క్తిప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వేడుకకు విశిష్ట అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి త‌న త‌మ్ము

  • Publish Date - June 12, 2024 / 04:28 PM IST

Ram Charan| ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రిత్వ శాఖల మంత్రులుగా గెలుపు గుర్రాలు ప్రమాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాణ స్వీకారోత్సవ కార్య‌క్ర‌మంలో ఆస‌క్తిప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వేడుకకు విశిష్ట అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి త‌న త‌మ్ముడు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం చేస్తుండ‌గా, చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆయ‌న ముఖంలో ఏదో తెలియ‌ని ఆనందం క‌నిపించింది. పవన్‌ కళ్యాణ్‌ అనే నేను మాటతో స‌భా ప్రాంగ‌ణం అంతా దద్దరిళ్లిపోయిందని చెప్పొచ్చు. అనంతరం వరుసగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో సినీ తారలు హైలైట్‌గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరు కాగా, ఆయనతోపాటు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా ప్రత్యేక అతిథిగా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం.

వేదిక‌పైకి వ‌చ్చిన చిరంజీవి, ర‌జ‌నీకాంత్‌లని స్వ‌యంగా బాల‌య్య ఆహ్వానించారు. అంతేకాదు రజనీ, చిరంజీవి, బాలయ్య, పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపై ఉండటం సినీ అభిమానులకు కనువిందు కలిగించింది. వీరితోపాటు మెగా ఫ్యామిలీ, రామ్‌ చరణ్‌, నిఖిల్‌, క్రిష్‌ వంటి వారు కూడా ఈ ఈవెంట్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక వాటితో పాటు మంత్రుల ప్ర‌మాణ స్వీకారం పూర్త‌య్యాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన పార్టనర్‌ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ని మెగాస్టార్‌ చిరంజీవిని ఇద్దరిని దగ్గరకి తీసుకుని వెళ్లి ఆ ఇద్ద‌రి చేతుల‌ని పైకి లేపి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేయడం హైలైట్‌గా నిలిచింది. ఆ దృశ్యాన్ని చూసి రామ్‌ చరణ్‌ ఎమోషనల్‌ కావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి

మ‌రోవైపు కార్య‌క్ర‌మానికి నారా వారి ఫ్యామిలి, నంద‌మూరి ఫ్యామిలీ కూడా హాజ‌రై సంద‌డి చేశారు. బాలకృష్ణ కూతురు, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఈ కార్యక్రమంలో సంద‌డి చేయ‌గా వీక్షకుల గ్యాలరీలో , రామ్ చరణ్ ప‌క్క‌నే కూర్చుంది. వారిద్ద‌రు కొద్ది సేపు సరదాగా మాట్లాడుకుంటున్నారు. దీంతో చరణ్, బ్రాహ్మణి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. ఈ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు, జోడి బాగుందిగా అంటూ ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.

Latest News