Trisha Krishnan | ఆ విషయంలో నయనతారనే మించిపోయిన త్రిష..!

  • Publish Date - April 3, 2024 / 11:50 AM IST

Trisha Krishnan | హీరోయిన్‌ త్రిష గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. సౌత్‌ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి భారీగానే క్రేజ్‌ ఉన్నది. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా టాప్‌ హీరోయిన్‌గా కొసాగుతూ వస్తున్నది. ప్రస్తుతం ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. ఇక ప్రస్తుతం బ్యూటీకి సంబంధించిన వార్త తెగ వైరల్‌ అవుతున్నది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా రూ.12కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటుందని సమాచారం. లేడీ సూపర్‌స్టార్‌ నయనతారను మించి రెమ్యునరేషన్‌ తీసుకుంటుందని తెలుస్తున్నది. ఇటీవల త్రిష నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలో చెన్నై బ్యూటీ భారీగానే ఫీజును పెంచేసిందని టాక్‌ నడుస్తున్నది. నాలుగు పదుల వయసులోనూ వరుస చిత్రాలు చేస్తూ కెరియర్‌లో మరోసారి బిజీగా ఉంటున్నది. ప్రస్తుతం ఏకంగా ఐదు చిత్రాల్లో నటిస్తుందంటే త్రిష క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తున్నది. 2021లో పేట చిత్రంతో ఇండస్ట్రీకి కొద్దిరోజుల దూరమైన త్రిష మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’తో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ చిత్రంలో ‘కుందవి’ పాత్రలో అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకున్నది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించగా త్రిష కెరీర్‌ను మరోసారి మలుపుతిప్పింది. ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నది. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నది. ఇప్పటి వరకు త్రిష పారితోషకం రూ.6కోట్ల వరకు తీసుకుంటూ ఉండేది.. ప్రస్తుతం ఏకంగా రూ.12కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు టాక్‌ నడుస్తున్నది. చివరిసారిగా త్రిష విజయ్‌ దళపతి సరసన ‘లియో’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం అజిత్‌ కుమార్‌ సరసన ‘విదాముయార్చి’ చిత్రంలో నటిస్తున్నది. మలయాళంలో మోహన్‌లాల్‌ సరసన ‘రామ్‌’, ఐడెంటిటీ, విశ్వనటుడు కమల్‌ హసన్‌ సరసన ‘థగ్‌లైఫ్‌’లో నటిస్తున్నది. ఇక తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్నది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత చిరంజీవితో జటకట్టబోతున్నది. చిరుతో కలిసి ‘స్టాలిన్‌’లో నటించిన విషయం తెలిసిందే.

Latest News