Sridevi Biopic | నేను బతికున్నంతకాలం అలా జరుగనివ్వను..! శ్రీదేవి బయోపిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బోనీ కపూర్‌

  • Publish Date - April 4, 2024 / 10:00 AM IST

Sridevi Biopic | అలనటి అందాల తార శ్రీదేవి. నాలుగు సంవత్సరాల వయసులో బాలనటిగా నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించింది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన అందం, అభినయంతో యావత్‌ భారతీయ సినీ ప్రియులను అలరించింది. 2018లో ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆమె మరణం తర్వాత బాలీవుడ్‌లో ఆమె బయోపిక్‌ వార్తలు వస్తున్నాయి. తాజాగా శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ బయోపిక్‌పై స్పందించారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘మైదాన్‌’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గన్‌ హీరోటా నటించారు. సినిమా ప్రమోషన్స్‌ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి బయోపిక్‌పై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా బోనీకపూర్‌ స్పందించారు. ‘శ్రీదేవి ప్రైవేట్‌ పర్సన్‌. ఆమె జీవితం ప్రైవేట్‌గా ఉండాలి. అది ఎప్పటికీ జరుగుతుందని నేను అనుకోను. నేను బతికి ఉన్నంతకాలం అలా జరుగనివ్వను’ అంటూ స్పష్టం చేశారు.

శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందారు. 1996లో శ్రీదేవి, బోనీకపూ‌ర్‌ పెళ్లి చేసుకున్నారు. 1997లో జ‌న‌వ‌రిలో మ‌రోసారి అంద‌రి స‌మ‌క్షంలో వివాహం చేసుకున్నారు. శ్రీదేవి-బోనీకపూర్‌ జంటకు జాన్వీకపూర్‌, ఖుషీకపూర్‌ ఇద్దరు కూతుళ్లున్నారు. ఇప్పటికీ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నది. ఖుషీకపూర్‌ సైతం చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి 2018, ఫిబ్రవరి 24న దుబాయిలోని ఓ హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శ్రీదేవి మరణించడం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక బోనీ కపూర్‌ ప్రస్తుతం తన ప్రొడక్షన్‌ హౌస్‌లో ‘మైదాన్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫుట్‌బాల్‌ కోచ్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత కథ ఆధారంగా.. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్‌కి జోడీగా ప్రియమణి నటిస్తున్నది. ఈ నెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది.

Latest News