Site icon vidhaatha

శ్రీకాకుళం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.

విధాత:నందిగాం మండలం కాపు తెంబూరు జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.మృతులు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ చిన్నబడాం గ్రామానికి చెందిన మజ్జి లక్ష్మణ్ రావు(36), గేదెల ప్రకాష్(33)గుర్తింపు.ఘటనపై నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version