- కాంగ్రెస్కు పదేండ్లలో 11 మంది సీఎంల రాజీనామా
- మధ్యప్రదేశ్ నేత కమల్ నాథ్ కాంగ్రెస్ను వీడుతారనే
- ఊహాగానాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో చర్చ
విధాత: కాంగ్రెస్ పార్టీలో అధికారం చేపట్టి వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన కీలక నేతలు ఒక్కొక్కరుగా చేయి జారిపోతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 11 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పార్టీని వీడారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బీజేపీలో చేరడంపై ఊహాగానాలు చెలరేగుతున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇతర పార్టీలలో చేరారు.
ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన తన కుమారుడు నకుల్నాథ్తో కలిసి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, మధ్యప్రదేశ్లోని ఇతర నాయకులు పార్టీ మారకుండా చూసేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. ఆయన బీజేపీలో చేరతారా లేదా అనే దానిపై కమల్నాథ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
గత పదేండ్లలో కాంగ్రెస్ పార్టీని వీడిన ముఖ్యమంత్రులు ఎవరు అంటే..
అశోక్ చవాన్
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీ మారిన జాబితాలో తాజాగా చేరారు. రాజ్యసభకు నామినేషన్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. కాషాయ పార్టీలో చేరిన తర్వాత ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
కిరణ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి ఏపీకి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2023లో ఆయన బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి కాంగ్రెస్ తప్పుడు నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు.
అమరీందర్ సింగ్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ 2022లో అధికార పోరుతో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని కోరడంతో బీజేపీలో చేరారు. ఆయన తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC)ని కూడా బీజేపీలో విలీనం చేశారు.
దిగంబర్ కామత్
దిగంబర్ కామత్ గోవా మాజీ ముఖ్యమంత్రి. 2022 సెప్టెంబర్లో కాంగ్రెస్ను వీడి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు.
రవి నాయక్
రవి నాయక్ 2021లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మాజీ గోవా ముఖ్యమంత్రి. మనోహర్ పారికర్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రి. కాంగ్రెస్ నుంచి వైదొలిగిన మరో మాజీ గోవా ముఖ్యమంత్రి లుయిజిన్హో ఫలేరో. సెప్టెంబర్ 2021లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరేందుకు ఆయన పార్టీని వీడారు. మరో మాజీ గోవా ముఖ్యమంత్రి చర్చిల్ అలెమావో కాంగ్రెస్ను వీడి 2014లో టీఎంసీలో చేరారు.
అజిత్ జోగి
దివంగత అజిత్ జోగి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ను వీడి తన సొంత పార్టీ జనతా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ (జోగి)ని స్థాపించారు.
ఎస్ఎం కృష్ణ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ 2017 జనవరిలో కాంగ్రెస్కు గడ్ బై చెప్పారు. రెండు నెలల తర్వాత కాషాయ పార్టీలో చేరారు.
పెమా ఖండూ
అరుణాచ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పెమా ఖండూ 2016 సెప్టెంబర్లో కాంగ్రెస్ను వీడారు. అధికార పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (PPA)లో చేరారు. ఆయనతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలను ప్రాంతీయ పార్టీ సస్పెండ్ చేసింది, ఆ తర్వాత వారు బీజేపీలో చేరారు.
గిరిధర్ గమాంగ్
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ 2015లో కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరారు. అయితే, ఈ ఏడాది జనవరిలో ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరారు.
విజయ్ బహుగుణ
విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి. 2016లో కాంగ్రెస్ తన స్థానంలో హరీష్ రావత్తో బీజేపీలో చేరారు. విజయ్, మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఏకకాలంలో పార్టీని వీడారు.
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ 2018లో కాంగ్రెస్కి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ 2022లో కాంగ్రెస్ను విడిచిపెట్టారు. డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ (DAP) అనే పార్టీని స్థాపించారు.