విధాత: నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట క్రాస్ రోడ్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు.
ప్రమాదంలో గుడిపల్లి గ్రామపంచాయతీ భరత్ పురానికి చెందిన చాట్లపర్తి రాంరెడ్డి( 65) స్కూటీపై వెళ్తుండగా మినీ బస్సు ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.