బీఆరెస్‌లో చేరిన బీజేపీ నేత రాకేశ్‌ రెడ్డి

  • Publish Date - November 4, 2023 / 03:23 PM IST

విధాత : వరంగల్‌ బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి శనివారం బీఆరెస్‌లో చేరారు. బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఆయన తెలంగాణ భవన్‌లో బీఆరెస్‌ కండువా కప్పుకున్నారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం బీజేపీ టికెట్‌ను రాకేశ్‌రెడ్డి ఆశించారు. అయితే జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మారావుకు ఆ టికెట్‌ కేటాయించారు. దీంతో అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేసిన రాకేశ్‌రెడ్డి బీఆరెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Latest News