జూలై 24కు ఓటుకు నోటు కేసు వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది

  • Publish Date - April 18, 2024 / 03:00 PM IST

విధాత : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్‌. భట్టీల ధర్మాసనం తెలిపింది.జూలై 24న సుప్రీంకోర్టు విచారణ చేపడుతామని పేర్కోంది.

ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేనందునా సెలవుల అనంతరం విచారణ చేపట్టాలన్న సీయర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు కేసు విచారణ వాయిదా వేసింది.

Latest News