Site icon vidhaatha

CM Revanth Reddy | కృష్ణా జలా­లకు.. నల్ల­గొండ రైతు­లకు మరణ శాసనం రాసిందే మీరు


CM Revanth Reddy | విధాత, హైద­రా­బాద్‌ : తెలం­గా­ణకు న్యాయంగా రావా­ల్సిన కృష్ణా జలా­లకు, నల్ల­గొండ రైతు­లకు మరణ శాసనం రాసిందే కేసీ­ఆర్ అని ముఖ్య­మంత్రి రేవం­త్‌­రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రాజె­క్టులు తీసు­కుం­టుంటే నల్ల­గొం­డలో సభ పెడ­తారా? బీఆ­రె­స్‌ను నిల­దీ­శారు. ‘కృష్ణా ప్రాజె­క్టు­లపై నల్ల­గొం­డలో కాదు.. దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేయాలి. ప్రాజె­క్టులు గుంజు­కుం­టా­నన్న మోదీ దగ్గర చేయాలి. చేత­నైతే జంతర్ మంతర్ వద్ద కేసీ­ఆర్, హరీశ్‌, కేటీ­ఆర్ ఆమ­రణ నిరా­హార దీక్ష చేయండి’ అని రేవంత్ రెడ్డి హితవు పలి­కారు.


గవ­ర్నర్ ప్రసం­గంపై ధన్య­వాద తీర్మా­నంపై జరి­గిన చర్చకు శుక్ర­వారం అసెం­బ్లీలో ముఖ్య­మంత్రి సమా­ధా­న­మిస్తూ ప్రతి­పక్ష నేత, మాజీ ముఖ్య­మంత్రి కేసీ­ఆర్ పాల­నపై తీవ్ర స్థాయిలో విమ­ర్శలు గుప్పిం­చారు. కృష్ణా జలాల హక్కు­లను ధార­దత్తం చేసిందే కేసీ­ఆర్ అని, విభ­జన చట్టం రాసిందే తానని ఆయన చెప్పుకొ­న్నా­రని పేర్కొ­న్నారు. అందులో లోపా­లకు బాధ్యత కేసీ­ఆ­ర్‌­దే­నని స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా ప్రాజె­క్టు­లను కేఆ­ర్‌­ఎం­బీకి అప్ప­గిం­చిం­దంటూ బాధ్య­తా­ర­హి­త్యంగా మాట్లా­డు­తు­న్నా­రని మండి­ప­డ్డారు.


కాళే­శ్వరం అవి­నీతి చర్చకు రావ­డంతో కేఆ­ర్‌­ఎంబీ సమ­స్యను తెర­పైకి తెచ్చా­రని ఆరో­పిం­చారు. రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తిని.. కేసీ­ఆర్ ఇచ్చిన అలు­సు­తోనే నాగా­ర్జున సాగర్ డ్యాంపైకి ఏపీ పోలీ­సులు ఆక్ర­మ­ణకు తెగ­బ­డ్డా­రని అన్నారు. రాయ­ల­సీ­మను రత­నాల సీమ చేస్తా­నని ఆనాడు కేసీ­ఆర్ హామీ ఇచ్చిం­డ­న్నారు. ‘ఏపీ సీఎం జగ­న్‌తో లంచ్ చేసి, మీ డైనింగ్ టేబుల్ మీద రాయ­ల­సీమ లిఫ్ట్ ప్రాజె­క్టుకు బీజం వేసింది నిజం కాదా?’ అని ప్రశ్నిం­చారు. ఏపీ ప్రభుత్వం ఏకే 47 తుపా­కు­లతో పోలీ­సు­లను సాగర్ డ్యామ్ మీకు పంపిం­చిం­దని, కేసీ­ఆర్ సహ­కారం లేకుం­డానే ఏపీ పోలీ­సులు అక్క­డికి వచ్చారా? అని నిల­దీ­శారు. వారిని ఎందుకు అడ్డు­కో­లేదో హరీ­శ్‌­రావు చెప్పా­ల­న్నారు. సెంటి­మెం­ట్‌ను రెచ్చ­గొట్టి ఎన్ని­కల్లో ఓట్లను కొల్ల­గొ­ట్టా­లని చూశా­రని విమ­ర్శిం­చారు.


కేసీ­ఆ­ర్‌కు పదేళ్లు అధి­కా­ర­మ­చ్చినా నల్ల­గొండ ఎస్‌­ఎ­ల్‌­బీసీ, పాల­మూరు ఎత్తి­పో­తల ప్రాజె­క్టు­లను పూర్తి చేయ­లే­దని విమ­ర్శిం­చారు. 97వేల కోట్లు ఖర్చు పెట్టిన కాళే­శ్వ­రంతో 97వేల ఎక­రా­లకు కూడా నీరి­వ్వ­లే­ద­న్నారు. తెలం­గాణ హక్కుల కోసం తాను కొట్లా­డు­తుంటే కాళ్ల కింద కట్టె పెడు­తు­న్నా­ర­న్నారు. ‘ప్రతి­పక్ష నేతగా బాధ్య­తగా సభకు వచ్చి కేసీ­ఆర్ మాట్లా­డరు. ఇక్క­డున్న బీఆ­రెస్ సభ్యులు నిజాలు మాట్లా­డ­లేరు’ అని ఎద్దేవా చేశారు. బీఅ­రె­స్‌లో ఓ జూని­యర్ ఆర్టిస్ట్ ఉన్నా­డని, అసెంబ్లీ ఎన్ని­కల్లో ఓట­మిని తట్టు­కో­లేక ఆటోలు ఎక్కి డ్రామాలు అడు­తు­న్నా­డని వ్యాఖ్యా­నిం­చారు. అయినా ప్రజలు ఆయ­నకు ఆర్టిస్ట్‌గా కూడా మార్కులు వేయడం లేదని పరో­క్షంగా కేటీ­ఆ­ర్‌పై రేవంత్ సెటైర్లు వేశారు.



తెలంగాణ ఓ భావోద్వేగం


తెలం­గాణ ఒక భౌగో­ళిక రాష్ట్రం మాత్రమే కాదని, మనం­దరి భావో­ద్వే­గ­మ­ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విధ్వం­స­కర ధోర­ణిని తిర­స్క­రిస్తూ ప్రజలు గత ఎన్నికల్లో స్పష్ట­మైన తీర్పు ఇచ్చా­ర­ని చెప్పారు. సభకు ప్రధాన ప్రతి­పక్ష నాయ­కుడు హజరు కాలే­దన్న రేవంత్‌.. ‘80 వేల పుస్త­కాలు చది­విన మేధా­విని అని ఆయన పదే పదే చెప్పు­కుం­టా­రు. ఆ మేధ­స్సును 4 కోట్ల ప్రజల అభి­వృద్ధి కోసం ఉప­యో­గి­స్తా­ర­ను­కు­న్నాం. ప్రభుత్వ నిర్ణ­యా­లపై సల­హాలు, సూచ­నలు ఇస్తా­రని భావించాం. ప్రధాన ప్రతి­పక్ష నాయ­కుడి కుర్చీ ఖాళీగా ఉండటం సమా­జా­నికి మంచిది కాదు. భవి­ష్యత్తులోనైనా ప్రతి­పక్ష నాయ­కుడు సభకు హాజరు కావా­లని కోరుకుంటున్నాం’ అని చెప్పారు.


రాష్ట్ర చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు


తెలం­గాణ అమ­రుల త్యాగాలు ప్రతి­బిం­బిం­చేలా టీఎస్‌ను టీజీగా మారిస్తే బీఆరెస్‌ నేతలు అభి­నం­ది­స్తా­రని అనుకున్నామని రేవంత్‌ చెప్పారు. ‘రాష్ట్ర అధి­కా­రిక చిహ్నంలో రాచ­రి­కపు ఆన­వాళ్లు ఉన్నా­యి. ఇది రాచ­రికం కాదు.. ప్రజా­స్వా­మ్యం. అందుకే ఆ చిహ్నాన్ని మార్చా­లని నిర్ణ­యిం­చాం. మా నిర్ణ­యాన్ని వాళ్లు స్వాగ­తి­స్తా­రని అను­కు­న్నాం’ అని అన్నారు. తెలం­గాణ తల్లి విగ్రహం మార్పు విష­యం­లోనూ ప్రతి­పక్షం కలిసి వస్తుం­ద­ను­కు­న్నా­మని, కానీ తమకు నిరాశే మిగి­లిం­దని చెప్పారు. ప్రస్తుతం ఉన్న తెలం­గాణ తల్లి విగ్రహం సగటు తెలం­గాణ బిడ్డలా లేదని, నగలు, కీరీ­టా­లతో అంలం­క­రించి ఉండటం సరి­కా­దని అన్నారు.


చాకలి ఐలమ్మ పోరాటం చేసిన నేల తెలం­గాణ అని, అలాంటి వీర మహి­ళల ఆస్తి­త్వాన్ని కాపా­డేం­దుకే తెలం­గాణ తల్లి నూతన విగ్రహాన్ని రూపొం­ది­స్తా­మని స్పష్టం చేశారు. అందెశ్రీ రాసిన జయ­జ­యహే తెలం­గాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చు­తా­మని తెలి­పారు. ఉద్య­మాన్ని ఉవ్వె­త్తున ఎగ­సి­ప­డేలా చేసిన జయ జయహే తెలం­గాణ గీతాన్ని గత పాల­కులు విన­ప­డ­కుండా చేశా­ర­న్నారు. జయ జయహే తెలం­గాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రక­టిస్తే ప్రతి­పక్ష నేతలు అభి­నం­ది­స్తా­రని ఆశిం­చిన తెలం­గాణ ప్రజ­లకు నిరాశే మిగి­లిం­ద­న్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడ­బి­డ్డ­లకు మేం ఉచిత బస్సు ప్రయాణం కల్పిం­చా­మ­న్నారు. మంచి పనిని అభి­నం­దిం­చ­క­పోగా.. బీఆ­రెస్ నేతలు వ్యతి­రే­కి­స్తు­న్నా­ర­న్నారు. ఉద్య­మ­కా­రు­లను..కవు­లను మేం గౌర­విం­చా­మని, మీ ఆన­వాళ్లు లేకుండా చేస్తా­మ­న్నారు.


నియామకాలంటే.. మీలా అమ్ముకోవడం కాదు..


2014 నుంచి 2018 వరకు బీఆ­రేస్ ఒక్క ఆడ­బి­డ్డకు మంత్రి పదవి ఇవ్వ­క­పో­యినా ఎవరూ ప్రశ్నిం­చ­లే­దని రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగ నియా­మ­కాలు అంటే మీలా సంతలో సరు­కుల్లా అమ్ము­కో­వడం కాద­న్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 6,954 నర్సింగ్ ఆఫీ­స­ర్లకు నియా­మక పత్రాలు అందిం­చా­మని, సింగ­రే­ణిలో 4వంద­లకు పైగా నియా­మ­కాలు చేపట్టమాని తెలిపారు. ఇది తమ చిత్త­శుద్ధి అన్నారు. విపక్ష నేతలు చొక్కాలు చించు­కున్నా.. త్వర­లోనే 15వేల పోలీస్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తా­మని స్పష్టంచేశారు. మా ప్రభు­త్వంలో మైనా­రి­టీ­లకు సము­చిత స్థానం కల్పిం­చా­మని, మైనా­రి­టీల హక్కులు, వాటా­లను, కోటా­లను కాపా­డ­టంలో మా ప్రభు­త్వా­నికి చిత్త­శుద్ధి ఉంద­న్నారు.


యూని­వ­ర్సి­టీ­లలో ఖాళీ­లను త్వర­లోనే భర్తీ చేస్తా­మని, గడీల పాలన ఆన­వా­ళ్లను బద్దలు కొట్టా­లనే డిసెం­బర్ 9 బదులు డిసెం­బర్ 7న ప్రమాణ స్వీకారం చేశా­మని, ప్రజ­లకు మంచి పరి­పా­లన అందిం­చా­లనే ముళ్ల కంచె­లను తొల­గిం­చా­మ­న్నారు. ఆ భవ­నా­నికి బడు­గుల ఆరాధ్య దైవం జ్యోతి­రావు పూలే పేరు పెట్టా­మ­న్నారు. నియో­జ­క­వర్గ సమ­స్య­లపై బీఆ­రెస్ ఎమ్మె­ల్యేలు నన్ను కలి­సేం­దుకు వస్తే వారిని అను­మా­నించి అవ­మా­ని­స్తు­న్నా­రని, ఒక్కరి కోసం ఎమ్మె­ల్యే­లం­ద­రిని బలి­ప­శు­వులు చేస్తు­న్నా­ర­న్నారు. ప్రెస్ మీట్లు పెట్టి వివ­రణ ఇచ్చు­కో­వా­ల్సిన దుస్థితి వాళ్ల­ద­న్నారు. మీరు వారిని అను­మా­నిం­చ­కండి… మేం మీలా కాదని స్పష్టం చేశారు. ఇప్ప­టికే 80శాతం పెన్ష­న్లను అందిం­చా­మని, మరో 15 రోజుల్లో మిగతా 20శాతం ఇచ్చి పెన్ష­న­ర్లను ఆదు­కుం­టా­మ­న్నారు.


తొమ్మి­ది­న్న­రేళ్ల బీఆ­రెస్ పాల­నలో కాళోజీ కళా­క్షేత్రం ఎందుకు పూర్తి చేయ­లే­దని, కాళోజీ కళా క్షేత్రాన్ని పూర్తి చేసి వారి గౌర­వాన్ని కాపా­డు­తా­మ­న్నారు. తొమ్మి­ది­న­రే­ళ్లలో తన గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చా­లన్న ప్రొఫె­సర్ జయ­శం­కర్ సార్ కోరిక కూడా తీర్చ­లే­క­పో­యా­రని, డిసెం­బర్ 7న అధి­కారం చేప­ట్టిన మరు­క్షణం జీవో 405 తో ఆ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చా­మ­న్నారు. ఇంద్ర­వెల్లి పోరాట యోధు­లకు నివా­ళిగా స్మృతి వనం అభి­వృద్ధి చేస్తున్న ఘనత మాదే­న­న్నారు. అమ­రుల కుటుం­బా­లను వెతికి వెతికి వారికి ఆలం­బ­నగా నిలి­చిన ఘనత మాద­న్నారు. తెలం­గాణ ప్రజ­లను చైత­న్య­ప­రి­చిన గూడ అంజ­న్నను పరా­మ­ర్శిం­చేం­దుకు కూడా ఆనాటి సీఎం రాజ­సౌధం నుంచి బయ­టకు రాలే­ద­న్నారు.


గద్దర్ అన్న విన­తి­పత్రం ఇస్తా­నని వస్తే ప్రగ­తి­భ­వన్ ముందు ఎర్రటి ఎండల మూడు గంట­లకు కూర్చో­బె­ట్టి­నా­రని, మేం చని­పో­యాక సగౌ­ర­వంగా అంత్య­క్రి­యలు జరి­పిం­చంతో పాటు మీరు చరిత్ర పుటల్లో లేకుండా చేయా­ల­ను­కున్న గద్దర్ పేరు­తోనే కళా­కా­రు­లకు అవా­ర్డులు అందిం­చా­లని మా ప్రభుత్వం నిర్ణ­యిం­చిం­ద­న్నారు. ప్రజల మేలు కోసం ప్రతి­పక్షం పని­చే­యా­లని, ప్రజా­భి­ప్రా­యా­నికి భిన్నంగా వ్యవ­హ­రించి రాజ­కీయ కుయు­క్తులు వేస్తా­మని మీరు అను­కుంటే అదీ చూద్దా­మ­న్నారు. తెలం­గాణ పున­ర్ని­ర్మా­ణంలో అందరి సహ­కారం ఉంటుం­దని భావి­స్తు­న్నా­న­న్నారు.


దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అది..


కుటుంబ పాలన అని కాంగ్రె­స్‌ను నింది­స్తు­న్నా­రని, గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుం­బ­మని, ప్రధాని పద­విని సోని­యా­గాంధీ వదు­లు­కు­న్నా­రని రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలం­గాణ కోసం కేసీ­ఆర్ కుటుంబం త్యాగం చేసిం­దేమీ లేద­న్నారు. తెలం­గాణ కోసమే రాజీ­నా­మా­లంటూ అదే వారి త్యాగా­లని చెప్పు­కు­న్నా­రని, ఎల­క్షన్‌, సెల­క్షన్‌, కలె­క్షన్ కోసమే వారి రాజీ­నా­మా­లని, అదే బీఆ­రెస్ విధా­న­మని, రాజీ­నా­మాలు చేసిన మూడు నెల­లకే మళ్లీ పద­వులు తీసు­కు­న్నా­ర­న్నారు. తమ నాయ­కుడు కోమ­టి­రెడ్డి వెంక­ట్‌­రెడ్డి తన పద­వికి రాజీ­నామా చేసి తెలం­గాణ వచ్చి­నాకే మంత్రి పదవి తీసు­కు­న్నా­రని చెప్పారు. తామెవరం తండ్రి పేరు, తాత పేరు చెప్పు­కొని మేనేజ్‌మెంట్‌ కోటాలో రాలే­దని, నల్ల­మల అడ­వుల నుంచి రైతు­బి­డ్డగా పైకి వచ్చా­మని అన్నారు. ఓ రైతు­బిడ్డ సీఎం కుర్చీలో కూర్చో­వడం కేసీ­ఆర్ జీర్ణిం­చు­కో­లే­క­పో­తు­న్నా­రని వ్యాఖ్యానించారు.


కాగా.. తాను పీసీసీ అధ్య­క్షు­డిగా సచి­వా­ల­యా­నికి వినతి పత్రం ఇచ్చేం­దుకు వస్తే వంద­లాది పోలీ­సులు చుట్టు­ముట్టి బంధించి తీసు­కెళ్లి ఇంటి­కాడ పడే­శా­ర­న్నారు. ఆది­వాసీ బిడ్డ సీతక్క వస్తే ఆమెను కూడా లోనికి రాని­య్య­లే­ద­న్నారు. ఎవరి కోసం సచి­వా­లయం? ప్రజల కోసం కాదా? ఎవరి ఆస్తి అది? ఎవరి పరి­పా­లన అక్క­డి­నుంచి జర­గాలి? ప్రజల్ని రాని­వ్వని సచి­వా­ల­యాలు ఎందుకు? అని రేవంత్ ప్రశ్నిం­చారు. అందుకే తాము అధి­కా­రం­లోకి రాగానే ప్రగ­తి­భ­వన్ గోడలు బద్దలు కొట్టి, సచి­వా­లయం గేట్లు బార్ల తెరిచి ప్రజా­భ­వ­న్‌గా మార్చి ప్రజ­లంతా స్వేచ్ఛగా సమ­స్యలు చెప్పు­కునే అవ­కాశం కల్పిం­చా­మ­న్నారు.


గ్రూప్‌1 పరీ­క్ష­లకు అభ్య­ర్ధుల వయో­ప­రి­మి­తిని 46 ఏళ్లకు పెంచి త్వర­లోనే గ్రూప్1 నిర్వ­హి­స్తా­మని శాస­న­స­భలో సీఎం రేవం­త్‌­రెడ్డి ప్రక­టిం­చారు. “కొన్ని నిబం­ధ­నల వల్ల టీఎ­స్పీ­ఎస్సీ ప్రక్షా­ళన ఆల­స్య­మైం­దని,. నలు­గురి ఉద్యో­గాలు పోయిన బాధతో విపక్ష నేతలు 2లక్షల ఉద్యో­గాల గురించి మాట్లా­డు­తు­న్నా­ర­న్నారు. జిరాక్స్ సెంట­ర్లలో ప్రశ్న­ప­త్రాలు ‘ విక్ర­యించి ఉద్యో­గాలు భర్తీ చేసే వాళ్లం కాదని,. ప్రభుత్వ శాఖల్లో బంధు­వు­లను పెట్టు­కొని ఉద్యో­గాలు అమ్ము­కునే వాళ్లం కాద­న్నారు. త్వర­లోనే పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగ నియా­మ­కాలు చేప­డ­తా­మని, ప్రభుత్వ ఉద్యో­గాలు భర్తీ చేయా­లంటే నిర్దిష్ట విధానం ఉంటుం­ద­న్నారు.


ఏ పాపం చూసినా హరీశ్‌రావే


ఏ పాపం చూసినా హరీష్ రావే కనబడుతున్నాడని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాపాల భైరవుడుగా హరీష్ రావు మారారని విమర్శించారు. ఆర్థిక శాఖ చూసినా, ఇరిగేషన్ శాఖ చూసినా ఆయన చేసిన పాపాలు అన్నీ బయటపడుతున్నాయని చెప్పారు. ‘13న కాళేశ్వరం పోదాం. మేడిపండు లాగా ఉన్న మేడిగడ్డ చూపిద్దాం.. 13న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బస్సు పెడుతాం. కేసీఆర్ కూడా 12న చర్చలో పాల్గొనాలి. 13న ఆయన కాళేశ్వరానికి రావాలి’ అని రేవంత్‌రెడ్డి కోరారు.

Exit mobile version