కేటీఆర్‌కు చర్లపల్లి జైలు చిప్పకూడు తప్పదు: సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారిగా స్పందించారు.

  • Publish Date - March 29, 2024 / 12:39 PM IST

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఫోన్లు విన్నాం..వింటే ఏమవుతుందని కేటీఆర్ అంటున్నాడని ..ఏమైతది చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడని సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ సిగ్గు లేకుండా ఆచ్చోసిన ఆంబోతు లెక్కన మాట్లాడుతున్నాడని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్ రెండు లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుందన్నారు.


బీజేపీ నేత డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్నారుగాని పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు తేలేదని, ఇంకా ఆ జిల్లా ప్రజలను ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మీద కోపంతో డీకే అరుణ వంశీచంద్‌ను ఓడించాలని ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్‌ను ఎందుకు ఓడించాలని మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500లకే సిలిండర్‌, 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, 10లక్షల ఆరోగ్య బీమా అందించేందుకు ఓడించాలా అంటు ప్రశ్నించారు. ప్రతిపక్ష బీఆరెస్‌, బీజేపీలకు ఓటమి తప్పదని గ్రహించి కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నాయన్నారు.

Latest News