విధాత : ఎన్నికల కోడ్ ఉలంఘన కారణాలతో జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఆయనను డీజీపీ కార్యాలయానికి ఆటాచ్ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓ పార్టీ కార్యక్రమంలో ఏసీపీ పాల్గొన్నారని, బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ఎన్నికల సంఘం నిబంధనల మేరకు దామోదర్రెడ్డిపై వేటు వేసింది.