విధాత: విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామంలో చోటు చేసుకుంది.
రైతు గుడిపాటి లింగయ్య తన పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ ఐ నర్సింహులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.