విధాత: నకిలీ బంగారంతో గ్రామీణ ప్రజలను మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ముగ్గురిని అరెస్ట్ చేసి రొమాంటిక్ తరలించినట్లు నల్గొండ ఎస్పీ అపూర్వరావు తెలిపారు. మంగళవారం ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన నిందితులు పంచారాం, గులాబ్ రామ్, ఉమారామ్ లను అరెస్ట్ చేసి, వారి నుంచి 2 లక్షల రూపాయల నగదు, ఐదు ఒరిజినల్ బంగారు బంతులు, నాలుగు సెల్ ఫోన్లు, 3 కేజీల బరువున్న నకిలీ బంగారు గొలుసులు (హరం) స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
మార్చి 17న కొండమల్లేపల్లికి అంగడి పేటకు చెందిన యమ్.దర్మరాజు, 20న పూరీ శేషయ్యలు కొండ మల్లెపల్లి పోలీస్ స్టేషన్లో నకిలీ బంగారు హారంని నిజమైన బంగారు హారం అని నమ్మిచి మోసం చేసిన విషయంపై ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితులు రాజస్థాన్ లో ప్లాస్టిక్ పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తారని, డబ్బులు సరిపోక నిందితులు అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసం చేయాలనే ఉద్దేశంతో అంగడిపేట గ్రామంలోని ఎం. ధర్మరాజు కిరణం దుకాణాన్ని సందర్శించి వెండి నాణెం, బిళ్లలను చూపించి కొనమని అడగగా కిరాణం దుకాణ యజమాని వెండి నాణెం తీసుకోవడానికి నిరాకరించాడు.
మరోసారి నిందితులు అదే దుకాణానికి వెళ్లి షాపు యజమాని ఎం. ధర్మరాజు , అతని భార్య అభినయకు గుంటూరులో కూలి పనికి వెళ్లి బేస్మెట్ను తవ్వగా మాకు బంగారు హారం దొరికిందని, సుమారు కిలోన్నర బంగారు ఆభరణాన్ని చూపించారు.
ముందుగా రెండు ఒరిజినల్ బంగారు బంతులను బంగారు హారం నుంచి తిసి ధర్మరాజుకి ఇవ్వగా, అతను తనకు తెలిసిన కమ్మరి వద్ద బంగారు బంతులను చెక్ చేయించగా అది నిజమైన బంగారం అని తేలింది.
దీంతో మార్చి 8న ధర్మరాజు మొబైల్ నంబర్కి నిందితులు ఫోన్ చేసి 3లక్షలతో దేవరకొండకు రమ్మని తెలపగా సాయంత్రం సమయంలో తన భార్యతో కలిసి దేవరకొండకు వెళ్లగా అక్కడ నిందితులు నకిలీ బంగారం అప్పగించి, రూ.3 లక్షలనులు తీసుకొని గుంటూరు జిల్లా బిసినేపల్లి గ్రామానికి వెళ్ళిపోయారు.
తరువాత మళ్లీ కొండమల్లేపల్లికి చెందిన రెండో బాధితుడు పూరీ శేషయ్య బ్రాండ్ ఫ్యాక్టరీ గార్మెంట్ దుకాణాం వద్దకు వెళ్లి ఒకటిన్నర కేజీ బరువున్న నకిలీ బంగారు ఆభరణం (గొలుసు) ఇచ్చి 3 లక్షలు డబ్బులు అడిగారు.
శేషయ్య బంగారు గొలుసు తీసుకొని అది నకిలీదని తెలుసుకొని, వారి వివరాలు అడిగి, డబ్బు తీసుకు వస్తానని చెప్పి వారిని దుకాణంలోనే కూర్చోబెట్టి కొండమల్లేపల్లి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసుకొని నేడు రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కేసుని చాకచక్యంగా డీయస్పీ దేవరకొండ నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఛేదించిన సీఐ ఎస్.శ్రీనివాసులు, ఎస్ఐలు పి.వీరబాబు, కె.సతీష్ లను, సిబ్బందిని ఎస్పీ అభిందించినారు.