Site icon vidhaatha

తగ్గిన పసిడి.. పెరిగిన వెండి..! హైదరాబాద్‌లో నేడు ధరలు ఎలా ఉన్నాయంటే.?

Gold Rates | మగువలకు గుడ్‌న్యూస్‌. బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండోరోజుల పాటు నిలకడగా కొనసాగిన ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.50 తగ్గి.. తులం రూ.57,750 పలుకుతున్నది. 24 క్యారెట్లపై సైతం రూ.50 తగ్గడంతో తులం రూ.63వేలకు చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,650కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.63వేలు పలుకుతున్నది.

ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,150కి తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63వేలు పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి పెరిగింది. రూ.300 పెరగడంతో కిలోకు రూ.75,300కు ఎగిసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలోకు రూ.76,800లకు చేరింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version