Site icon vidhaatha

Gold Rates | తగ్గిన బంగారం.. పెరిగిన వెండి.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే.?

Gold Rates | మగువలకు శుభవార్త. బంగారం ధరలు వరుసగా దిగివస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు ఊరట కలుగుతున్నది. బులియన్‌ మార్కెట్‌లో పుత్తడి ధరలు దిగిరాగా.. వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్లపై బంగారంపై రూ.100 తగ్గి తులానికి రూ.57,900 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై రూ.70 దిగివచ్చి.. తులానికి రూ.63,230కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,390 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,710కి తగ్గింది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,610కి దిగివచ్చింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,310కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,160 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి పెరిగింది. రూ.500 కిలోకు రూ.75వేలకు ఎగిసింది.

హైదరాబాద్‌లో కిలో వెండి రూ.76,500 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version