Site icon vidhaatha

Gold Rates | స్వల్పంగా పెరిగిన బంగారం.. తగ్గిన వెండి..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తున్నాయి. వరుసగా మూడోరోజు ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్లపై బంగారంపై రూ.10 తగ్గి తులానికి రూ.57,890 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై రూ.10 దిగివచ్చి.. తులానికి రూ.63,150కి తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,380 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,700కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,890 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,150కి దిగివచ్చింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,040 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,300కి చేరింది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,890 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,150 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు మళ్లీ వెండి ధర పెరుగుతూ వచ్చింది. రూ.100 కిలోకు రూ.75వేలకు ఎగిసింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.76,600 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version