Gold Rates | పసిడి ధరలు ఇటీవల భారీగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం బహిరంగ మార్కెట్లో నిలకడగా కొనసాగిన ధరలు.. సోమవారం స్వల్పంగా దిగివచ్చాయి. దాదాపు వారం రోజుల తర్వాత బంగారం ధర స్వల్పంగా దిగిరావడంతో కొనుగోలుదారులకు ఊరటనిచ్చినట్లయ్యింది. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.10 తగ్గి తులం రూ.60,740కి పతనమైంది. 24 క్యారెట్ల పసిడిపై రూ.66,260కి చేరింది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.61,490 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,090కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.66,260కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.60,890 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,410కి పతనమైంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,260 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అదే సమయంలో వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. రూ.100 తగ్గి కిలో రూ.75,600కు తగ్గింది. హైదరాబాద్లో వెండి కిలోకు రూ.79వేలు పలుకుతున్నది. మరో వైపు ప్లాటినం ధర నిలకడగా కొనసాగుతున్నది. తులం రూ.24,260 వద్ద ట్రేడవుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.