Gold Rates | ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో శనివారం బంగారం పైకి కదిలాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి తులానికి రూ.57,110కి పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.62,300 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,610 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,850 పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.51,110 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,300కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,260 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,450కి ఎగిసింది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,110 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,300 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం పెరిగింది. రూ.100 కిలో ధర రూ.75,700కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలోకు రూ.77,100 వద్ద ట్రేడవుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.