Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. 22 క్యారెట్లపై బంగారం రూ.57,200 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.62,400 ధర పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,050 వద్ద నిలకడగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,200 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,400 వద్ద స్థిరంగా ఉన్నది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,550 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,400 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు మళ్లీ వెండి ధర సైతం స్థిరంగానే ఉన్నది. హైదరాబాద్లో వెండి కిలో రూ.78వేలు పలుకుతున్నది.
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.