Site icon vidhaatha

Gold Rate | భారీగా పెరిగిన వెండి ధర..! స్థిరంగా బంగారం..! నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. అదే సమయంలో వెండి ధరలు షాక్‌ ఇస్తున్నాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల పెరుగుతూ వస్తున్న ధరలు బంగారం శనివారం స్థిరంగా కొనసాగుతున్నాయి.

గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు స్థిరంగా వినియోగదారులకు ఊరటనిచ్చినట్లయ్యింది. బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55వేలు కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.60వేలు పలుకుతున్నది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,150 వద్ద కొనసాగుతున్నది.

ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60వేల వద్ద ట్రేడవుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,490 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల ధర స్వర్ణం రూ.60వేలుగా ఉన్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60వేల వద్ద ట్రేడవుతున్నది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి సహా తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు బంగారం ధరలు వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండిపై రూ.1500 పెరగ్గా.. ప్రస్తుతం కిలో రూ.77,100గా ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో రూ.81,300 పలుకుతున్నది.

Exit mobile version