Gold Rate Today |
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.30 తగ్గి.. రూ.55,070కి చేరింది. మరో వైపు 24 క్యారెట్ల బంగారంపై రూ.40 తగ్గి రూ.60,470 వద్ద కొనసాగుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,210 వద్ద ట్రేడవుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.55,070 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 60,070గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55,120 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,110కి తగ్గింది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,070 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,070కి తగ్గింది. ఏపీలో విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి రూ.73,500కి చేరింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.79వేలుకుతున్నది.