Site icon vidhaatha

Gold Rate | మరోసారి బంగారం ధరలు పైపైకి..! హైదరాబాద్‌లో తులం ఎంత ఉందంటే..?

Gold Rate | దేశంలో బుధవారం బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.160 పెరిగి రూ.55,210కి చేరింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.180 పెరిగి తులానికి రూ.60,230 పలుకుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,210 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్​ రూ.60,230 వద్ద కొనసాగుతున్నది.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,550 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,230 పలుకుతున్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,300 పలుకుతున్నది. మరో వైపు ప్లాటినం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. తులానికి రూ.130 పెరిగి.. రూ.25,050కి చేరింది.

Exit mobile version