Site icon vidhaatha

Gold Rates | మరోసారి షాక్‌ ఇచ్చిన పుత్తడి..! తులానికి మళ్లీ రూ.60వేలకు చేరువలో..!

Gold Rates | కొనుగోలుదారులకు బంగారం ధరలు మరోసారి షాక్‌ ఇచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో పుత్తడి ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్లపై రూ.100 పెరిగి.. రూ.54,950 చేరింది. 24 క్యారెట్లపై రూ.110 పెరిగి రూ.59,950 పలుకుతున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,100కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,950 వద్ద ట్రేడవుతున్నది.

చెన్నైలో 22క్యారెట్ల బంగారం రూ.55,210 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,230కి చేరింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల పుత్తడి రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,950 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం పెరిగిగాయి. కిలోకు రూ.300 పెరిగి రూ.75,800 పలుకుతున్నది. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.79,300 వద్ద ట్రేడవుతున్నది.

Exit mobile version