Gold Rates | బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,450 పలుకుతున్నది. మరో వైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,600 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,450కి చేరింది.
చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.54,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,780 వద్ద స్థిరంగా ఉన్నది. బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,450 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,450 పలుకుతున్నది. ఏపీలని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి స్థిరంగా ఉన్నది. కిలోకు రూ.74,200 ఉండగా.. హైదరాబాద్లో కిలోకు రూ.77వేల ధర పలుకుతున్నది.