Site icon vidhaatha

Minister Harish Rao | తెలంగాణలో.. భూమికి బరువయ్యేంత పంట పండుతుంది: మంత్రి హరీశ్‌రావు

Minister Harish Rao,

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: తెలంగాణ ప్రజలు జొన్న, గట్క మక్క గట్క తప్ప ఏమీ తినలేదని, ఇవాళ తన వల్ల అన్నం తింటున్నారని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) చెప్పడం విడ్డురంగా ఉంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. జగదేవ్ పూర్‌లో సీఎం కేసీఆర్ (CM KCR) జన్మదినం సందర్భంగా చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల రమేష్ (Racharla Ramesh) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ (Grace Ball Cricket Tournament) విజేత, రన్నరప్ లకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతుంది ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు వరి సాగు చేస్తే, తెలంగాణలో 54 లక్షలు ఎకరాలలో వరి సాగు చేశామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన రాచర్ల రమేశ్‌ను అభినందించారు. కేసీఆర్ కారణజన్ముడని, చరిత్రను తిరగ రాశారని, కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ, మల్లన్న సాగర్లకు నీళ్లు వచ్చేవి కావని వివరించారు.

తైవాన్ దేశం(Taiwan) నుంచి ఫాక్స్‌కాన్ కంపనీ(Foxconn Company) లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ని కలిస్తే తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి పై ప్రజంటేషన్ ఇచ్చారని, ఏడేండ్లలో అబ్బురపోయేలా అభివృద్ధి కేసీఆర్ విజన్ చూసి తైవాన్ వచ్చి తమ ప్రభుత్వానికి వివరించాలని తైవాన్ దేశ ప్రతినిధులు కోరినట్లు, ఇది చూసిన తమకు ఎంతో సంతోషం కలిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ ఈ గడ్డపై ఇవాళ మండుటెండలో చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయని సంబురం వ్యక్తం చేశారు.

ఈ మేరకు విజేత ఉప్పల్ టీమ్, రన్నరప్ జగదేవ్ పూర్ టీమ్ కు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్సీ యాదవ రెడ్డి(MLC Yadava Reddy), ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక-పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ రెడ్డి, ఇతర మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇందుప్రియాల్ పెద్దమ్మతో హరీష్ రావు ఆత్మీయ సంభాషణ

దౌల్తాబాద్ (Daulatabad) మండలం ఇందూప్రియాల్ (Indupiriyal) గ్రామంలో శ్రీరాముల వారి దేవాలయంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో గాంధీ విగ్రహా ఆవిష్కరణ చేసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ ఎస్సీ కాలనీలో కల్యాణ మండపంను ప్రారంభించారు.

అనంతరం గ్రామంలో అవ్వ‌ల‌తో మంత్రి మాట మంతి అమ్మ బాగున్నావా, పింఛన్ వస్తుందా, సంతోషంగా ఉన్నావా అంటూ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఒక పెద్దమ్మతో ఆత్మీయంగా మాట్లాడారు. పెద్దమ్మ సంతోషంతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా ఉండగా మాకు తక్కువేముందని, కన్న బిడ్డల్లా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడని తెలిపింది. నాకు పింఛన్ వస్తుంది. ఇంటికి నీళ్లు వస్తున్నాయి. కరెంట్ వస్తుంది. రైతులకు రైతుబంధు వస్తుంది సంతోషంగా ఉన్నామని పెద్దమ్మ నవ్వుతూ చెప్పడంతో ఆ ప్రాంతంలో నవ్వులు విరిసాయి.

Exit mobile version