Rashmika Mandanna | ఐపీఎల్ 16వ సీజన్ నేటి నుంచి మొదలుకానున్నది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనున్నది. అంతకు ముందు ప్రారంభ వేడుకలను అట్టహాసంగా బీసీసీఐ నిర్వహించనున్నది.
తొలి మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుండగా.. అంతకు ముందు సాయంత్రం 6 గంటలకే ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.
వేడుకల్లో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వనున్నారు. మెగా ఈవెంట్లో పుష్పతో మంచి గుర్తింపు పొందిన రష్మిక మందన్నా సైతం ప్రారంభోత్సవ వేడుకల్లో ఫెర్ఫామెన్స్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ధ్రువీకరించింది.
ఫైర్ బ్రాండ్