విధాత: ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ మంగళవారం కుమారుడితో వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.