Site icon vidhaatha

KarimNagar: కుక్కల దాడి.. 16 గొర్రెలు మృతి

విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్ గ్రామంలో కుక్కల దాడిలో దానవేని మల్లయ్యకు చెందిన 16 గొర్రెలు మృతి చెందాయి. పాకలో ఉన్న గొర్రెలపై గత రాత్రి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 16 గొర్రెలు మృతి చెందగా మరో నాలుగింటికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వైద్య అధికారి శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించగా, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన వాటిని పరిశీలించి, తీవ్రంగా గాయపడ్డ వాటికి చికిత్స చేశారు. సర్పంచ్ శ్రీనివాస్
నష్టపోయిన గొర్రెల కాపరికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Exit mobile version