KCR | 18న బీఆరెస్ ఎంపీ అభ్యర్థులతో కేసీఆర్ కీలక భేటీ

లోక్‌సభ ఎన్నికల సన్నాహాలలో భాగంగా ఈనెల 18న తెలంగాణ భవన్‌లో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు

  • Publish Date - April 16, 2024 / 05:10 PM IST

అదే రోజున బీఫారాల పంపిణీ

విధాత : లోక్‌సభ ఎన్నికల సన్నాహాలలో భాగంగా ఈనెల 18న తెలంగాణ భవన్‌లో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ ఎంపీ అభ్యర్ధులకు ఆయన బీ-ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. పార్టీ నేతలకు ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు.

ఎంపీ అభ్యర్ధులతోపాటు ‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు. రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులను సమావేశానికి ఆహ్వానించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కోసం సాగే ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్‌పై ఈ సమావేశంలో పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేస్తారు.

Latest News