- మాజీ మంత్రులు దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డి, జగ్గారెడ్డికి ఛాన్స్
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజక వర్గాల్లో పీసీసీ నియామకాలు
- పీసీసీ అదేశాలు అమలు బాధ్యత సమన్వయకర్తలకు అప్పగింత..!
- ఏఐసీసీ కో అప్టేడ్ సభ్యునిగా మాజీ ఎంపీ సురేష్ శెట్కర్ నియామకం.
- కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రధాన కార్యదర్శులకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హాథ్ సే హాథ్ సమన్వయకర్తల నియామకం
విధాత, ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలకు (ఏఐసీసీ) ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో స్థానం దక్కింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిలను ఏఐసీసీ సభ్యులుగా పార్టీ అధిష్టాన వర్గం నియమించింది.
అంతే కాకుండా నారాయంఖేడ్ మాజీ ఎమ్మెల్యే, సురేష్ శెట్కర్ను ఏఐసీసీ కోప్టెడ్ సభ్యునిగా నియమించారు. హాథ్ సే హాథ్ జోడో నియోజకవర్గాలలో సమన్వయకర్తలుగా పీసీసీ ప్రధాన కార్యదర్శులను పీసీసీ అధిష్టాన వర్గం నియమించింది. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పీసీసీ అధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమం అమలు చేసేందుకు నాయకుల మధ్య సమన్వయం చేస్తూ కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు ఈ సమన్వయకర్తలు పనిచేస్తారు.
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాలు చేస్తున్నారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలలో డీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, తూము కుంట నర్సారెడ్డి, నిర్మలా జయప్రకాష్ రెడ్డి అధ్వర్యంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాదయాత్ర ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చొచ్చు కెలుతున్నారు. పాదయాత్రలో సమస్యలు తెలుసుకుంటున్నారు. నర్సాపూర్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి అవుల రాజిరెడ్డి అధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
- 10 నియోజక వర్గాల్లో హాథ్ సే హాథ్ జోడో సమన్వయకర్తలు
దుబ్బాక నియోజకవర్గానికి జే, జయపాల్, జహీరాబాద్ నియోజక వర్గానికి బొల్లు కిషన్, గజ్వేల్ నియోజకవర్గానికి పి.ప్రమోద్ కుమార్, నారయణ ఖేడ్ నియోజకవర్గానికి అల్గేటి మధుసూదన్ రెడ్డిలను నియమించారు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజక వర్గాల నాయకులను కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయనున్నారు.