Minister Harishrao
- బిర్నీస్ పంటకు రంది లేదు
- మునుపు నీళ్ల, కరెంటు బాధ ఉండేది
- ఇప్పుడు పక్కనే కాల్వ, కరెంటు ఫుల్
- మంత్రి ఆప్యాయ పలకరింపుతో.. ఆనందంలో రైతులు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఏమ్మా.. బాగున్నారా.. అంతా బీర్నీస్ పంటనే పెట్టావ్.. ఎందుకు అంటూ ఇందూప్రియాల్ గ్రామ శివారులో కూరగాయలు పండిస్తున్న పొలం చూసి మంత్రి హరీశ్రావు పొలం బాట పట్టారు. మంత్రి మా పొలానికి రావడమేంటనీ ఆశ్చర్యంగా చూస్తూనే.. బీర్నీస్ పంటకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది సారూ అంటూ మహిళా రైతు మంత్రికి బదులిచ్చింది.
మరీ గిట్టుబాటు అయితుందా.. మీరు ఎంత మంది పనోళ్ళను పెట్టుకున్నారని ఆరా తీయగా.. లేదు సారూ అత్త, కోడలు, బిడ్డ అందరూ కలిసి పండిస్తున్నామని, ఇంతకు మునుపు నీళ్ల బాధ, కరెంటు బాధ ఉండేది. ఇప్పుడు పక్కనే కాల్వ పోతుందని నీళ్ల బాధ తప్పిందని, కరెంటు మోటారు పెట్టి నీళ్లు వాడుకుంటున్నామ ని బదులిచ్చింది.
కేసీఆర్ సార్ పుణ్యమా అని కరెంటు, నీళ్లు ఫుల్గా వచ్చినయ్ అంటూ సంబురంగా చెప్పుకొచ్చింది. ఆ చుట్టూ పక్కల పొలాల్లో కూడా అందరూ బీర్నీస్ పంట పండించడం వారితో కాసేపు మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ మేరకు బీర్నీస్ మంచిగ పండింది సారూ అంటూ ఆప్యాయంగా కూర వండుకోమని మంత్రికి బీర్నీస్ కూరగాయలు అందించగా ఆత్మీయంగా మంత్రి స్వీకరించారు.