- 800 కారుణ్య నియామకాలు
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam | విధాత, హైదరాబాద్ : లాభాల కోసం కాకుండా ప్రజాసేవ లక్ష్యంగా ఆర్టీసీ సంస్థ పనిచేస్తుందని, నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు సంస్థ సేవలందిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్లో టీఎస్ ఆర్టీసీ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన ముఖ్య అతిధఇఆగ హాజరై మాట్లాడారు. ఆర్టీసీ ప్రజల సంస్థ అని, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇది నిరంతర ప్రక్రియ అందులో భాగంగా ఈరోజు కొంతమంది కానిస్టేబుల్స్కు నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతుందన్నారు. గతంలో కరోనా , సమ్మె కారణంగా ఆర్టీసీ కి పలు సమస్యలు ఏర్పడ్డాయని, వాటన్నిటిని అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందన్నారు. నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నామన్నారు.
ఉచిత పథకంలో 14.50కోట్ల మంది ప్రయాణం
ఇప్పటి వరకు మహాలక్ష్మి ఉచితి బస్ ప్రయాణ వసతి పథకం కింద 14.50 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. అక్యూపెన్సీ రేషియో బస్ స్టాండ్ లు ఖాళీగా ఉన్న పరిస్థితి నుండి బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలోనూతన బస్సుల కొనుగోలు ,నూతన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ సహకారంతో ఏండి గారి మార్గదర్శకంలో ముందుకు పోతున్నామన్నారు.
ప్రజలంతా సహకరించాలని, దేశ వ్యాప్తంగా రైల్వే ఏ విధంగా ఉపయోగ పడుతుందో అదే రీతిలో పేద ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు గమ్యానికి చేర్చే వ్యవస్థ రాష్ట్ర రవాణా లో ఆర్టీసీ పాత్ర కీలకమైందన్నారు. ఆర్టీసీ మనందరిదని దానిని కాపాడుకోవాలన్నారు. ఆర్టీసీని ముందుకు తీసుకుపోవడంలో అందరి సలహాలు కోరుతూ ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నము చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సంస్థ అధికారులు పాల్గొన్నారు.