Site icon vidhaatha

MP Komati Reddy | సోషల్ మీడియాపై ఎంపీ వెంకటరెడ్డి ఫైర్

విధాత: సోషల్ మీడియా వచ్చాకే భయం, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు.. ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komati Reddy Venkata Reddy)ఫైర్ అయ్యారు. డాక్టర్ చెరుకు సుధాకర్‌కు తనకు మధ్య తాజాగా నెలకొన్న వివాదంపై ఆయన స్పందిస్తూ తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానన్నారు.

న్యాయస్థానంపై గౌరవం ఉందని ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ జరుగుతుందని, నెలాఖరుకు 40వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని వెల్లడించారు.

Exit mobile version