చెత్త పోతుంది.. గట్టి వాళ్లే మిగులుతారు: పోచారం

బీఆరెస్ నుంచి వరుసగా సాగుతున్న నాయకుల వలసలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్‌, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Publish Date - March 29, 2024 / 12:19 PM IST

  • వలసలపై మాజీ స్పీకర్ పోచారం వ్యాఖ్యలు


విధాత, హైదరాబాద్ : బీఆరెస్ నుంచి వరుసగా సాగుతున్న నాయకుల వలసలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్‌, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలతో బీఆరెస్‌ నుంచి చెత్త అంతా పోతుంది.. గట్టి వాళ్లే మిగులుతున్నారని వ్యాఖ్యానించారు. నాయకులను కొంటారు కానీ కార్యకర్తలను కొనలేరని, తొలి నుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారన్నారు.


పదవులు, వ్యాపారాల కోసం వచ్చిన వారే పార్టీ మారుతున్నారని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా కేకే, కడియం శ్రీహరిలు కూడా బీఆరెస్‌ను వీడనున్న నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాతా ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయన్నారు. మోసకారుల జాబితా రాస్తే అందులో తొలిపేరు బీబీ పాటిల్‌దే ఉంటుందన్నారు.

Latest News