Site icon vidhaatha

ప్రైవేట్ బస్సు బోల్తా.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

విధాత: సూర్యాపేట సమీపంలో టేకుమట్ల వద్ద సోమవారం ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది.

ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో కొందరికి ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Exit mobile version