ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌ కు మధ్యంతర బెయిల్..

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో బోయిన‌ప‌ల్లి అభిషేక్‌కు సుప్రీం కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది. అభిషేక్ త‌న భార్య‌కు ఆరోగ్యం బాగా లేద‌ని వైద్యం చేయించ‌డానికి బెయిల్ మంజూరు చేయాల‌ని సుప్రీం కోర్టును కోరారు

  • Publish Date - March 20, 2024 / 12:31 PM IST

విధాత‌: ఢిల్లీ లిక్క‌ర్ కేసులో బోయిన‌ప‌ల్లి అభిషేక్‌కు సుప్రీం కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది. అభిషేక్ త‌న భార్య‌కు ఆరోగ్యం బాగా లేద‌ని వైద్యం చేయించ‌డానికి బెయిల్ మంజూరు చేయాల‌ని సుప్రీం కోర్టును కోరారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు భార్య‌కు వైద్యం చేయించ‌డం కోసం అభిషేక్‌కు 5 వారాలు బెయిల్ మంజూరు చేసింది.


అయితే పాస్ పోర్ట్ స‌రెండ్ చేయాల‌ని సుప్రీం కోర్టు అభిషేక్‌కు స్పష్టం చేసింది. భార్య‌కు హైద‌రాబాద్‌లో వైద్యం చేయించ‌డానికి మాత్ర‌మే అభిషేక్‌కు అనుమ‌తి ఇచ్చింది. కాగా బెయిల్‌పై వెళుతున్న అభిషేక్ త‌న ఫోన్ నెంబ‌ర్ ఈడీ అధికారుల‌కు ఇవ్వాల‌ని ఆదేశించింది. అలాగే సంబంధిత అధికారులకు సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సుప్రీంకోర్టు అభిషేక్‌కు స్ప‌ష్టం చేసింది.

Latest News