Suryapeta | మంత్రి జగదీష్ రెడ్డి ఔదార్యం.. ఒక రోజు పోలీస్ అధికారిణిగా క్యాన్సర్ బాధితురాలు

Suryapeta సూర్యాపేట పోలీసుల మానవత్వం… మేక్ ఎ విష్‌తో మానసిక స్థైర్యం విధాత: మంత్రి జి.జగదీష్ రెడ్డి ఔదార్యంతో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ యువతి కోరికను సూర్యాపేట పోలీసులు నెరవేర్చారు. ఆమెను ఒక్క రోజు ఎస్సై చేశారు. మేక్ ఎ విష్ కార్యక్రమంలో భాగంగా యువతి కోరికను నెరవేర్చి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్ తండాకు చెందిన ధరావత్ చాంప్ల-భూభా దంపతుల కుమార్తె స్వాతి. చదువుతో పాటు ఆట పాటల్లోనూ చాలా […]

  • Publish Date - June 6, 2023 / 02:09 PM IST

Suryapeta

  • సూర్యాపేట పోలీసుల మానవత్వం…
  • మేక్ ఎ విష్‌తో మానసిక స్థైర్యం

విధాత: మంత్రి జి.జగదీష్ రెడ్డి ఔదార్యంతో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ యువతి కోరికను సూర్యాపేట పోలీసులు నెరవేర్చారు. ఆమెను ఒక్క రోజు ఎస్సై చేశారు. మేక్ ఎ విష్ కార్యక్రమంలో భాగంగా యువతి కోరికను నెరవేర్చి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు.

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్ తండాకు చెందిన ధరావత్ చాంప్ల-భూభా దంపతుల కుమార్తె స్వాతి. చదువుతో పాటు ఆట పాటల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉన్న స్వాతి ఒక్కసారిగా జ్వరం బారిన పడింది. దానికి తోడు కామెర్ల వ్యాధి సోకి ఫ్రాంక్రియాటిస్ కేన్సర్ గా మారింది. మందులతో కాలాన్ని నెట్టుకొస్తున్న స్వాతి పరిస్థితి చేయి దాటి పోయేలా ఉందని తల్లిదండ్రులు భావించారు.

క్యాన్సర్ తో పోరాడుతున్న త‌మ‌ బిడ్డకు ఒకవైపు ధైర్యం చెబుతూనే ఇంకోవైపు వచ్చిన వ్యాధి తగ్గుతోందో లేదో తెలియదుగాని నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పమ్మా అని తల్లిదండ్రులు అడిగారు. యువతి చెప్పిన సమాధానంతో తల్లితండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. నాకు మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడాలని, ఆయనతో కలిసి భోజనం చేయాలని ఉందంటూ తన మనసులోని మాటను స్వాతి బయట పెట్టింది.

ఇది విన్న డాక్టర్ల బృందం స్వాతి కోరికను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి.. ఆమెతో పాటు కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా తనకు ఒక్కసారి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని మంత్రి జగదీష్ రెడ్డికి స్వాతి విన్నవించుకుంది.

సానుకూలంగా స్పందించిన మంత్రి స్వాతి కోరికను నెరవేర్చాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను ఆదేశించారు. స్వాతి కోరిక నెరవేర్చేందుకు చివ్వెంల పోలీసులు ముందుకొచ్చారు. ఆమె ఫుల్ యూనిఫాంలో చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు తీసుకున్నారు.

పోలీస్ స్టేషన్ SHOగా ఒకరోజు విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు శాంతి భద్రతలపై సూచనలు చేశారు. ఎస్సైగా విధులు నిర్వహించిన స్వాతి రాత్రి తన గ్రామానికి పోలీస్ అధికారిణిగా చేరుకుంది. తన డ్రీమ్ ను నెరవేర్చినందుకు చివ్వెంల పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

పోలీస్ అధికారిణి బాధ్యత తనలో మానసిక స్థైర్యాన్ని పెంచిందన్నారు. పోలీసులు ఇచ్చిన ధైర్యంతో జీవితంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తానని ఆమె అన్నారు. స్వాతి త్వరగా కోలుకోవాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు.

Latest News