Site icon vidhaatha

తెలంగాణలో 65 అధునిక స్కిల్ కేంద్రాల ఏర్పాటు


విధాత, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో టాటా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. శనివారం సచివాలయంలో సచివాలయంలో టాటా టెక్నాలజీస్​ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. సంబంధిత ఎంవోయూ పత్రాలపై కంపనీ ప్రతినిధులు, అధికారులు సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్‌) రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనుంది.


ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును టాటా టెక్నాలజీస్ చేపట్టనుంది. స్కిల్ సెంటర్ ద్వారా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సుల నిర్వహించనున్నారు. ఈ 2024-25 విద్యాసంవత్సరం నుంచే ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. టాటా గ్రూప్ కంపనీతో జరిగిన ఒప్పందతో ఈ దిశగా కీలక ముందడుగు పడింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు, టాటా గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version