Site icon vidhaatha

Nalgonda: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

విధాత: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టి పాలెం వద్ద ఆటోను డీసీఎం ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version